టీ20ల్లోనూ పంతే మ్యాచ్ విన్నర్: లక్ష్మణ్

టీ20ల్లోనూ పంతే మ్యాచ్ విన్నర్: లక్ష్మణ్

ముంబై: టీ20 ఫార్మాట్లోనూ టీమిండియాకు రిషబ్ పంత్ మ్యాచ్ విన్నర్ అవుతాడని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని అతనికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్నాడు. ‘ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున చాలా ప్రెజర్ సిచ్యువేషన్స్లో పంత్ ఎలా బ్యాటింగ్ చేశాడో మనం చూశాం. చాలా మ్యాచ్లు గెలిపించాడు కూడా. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్ కావడంతో చాలా ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉంటాయి. అదే టైమ్లో అపోజిషన్ కెప్టెన్కు ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. రిషబ్ టీమ్ లో ఉండటం వల్ల అదనపు ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి ఒకటి, రెండు ఇన్నింగ్స్ లతో అతని సత్తాను అంచనా వేయొద్దు. వరల్డ్ కప్ ను మైండ్ లో ఉంచుకుంటే ఎక్కువ చాన్స్ లు ఇవ్వాలి’ అని సూచించాడు.