ప్రేమించిందని నవ వధువును స్టేషన్ లో వదిలేసిన తల్లిదండ్రులు, వరుడు

ప్రేమించిందని నవ వధువును స్టేషన్ లో వదిలేసిన తల్లిదండ్రులు, వరుడు

మేళ తాళాల మధ్య పెళ్లి జరిగింది. అప్పగింతల అనంతరం ధూంధాంగా పెండ్లి బరాత్ జరుగుతోంది. ఇంతలో ఓ యువకుడు బరాత్ ను అడ్డుకొని హంగామా చేశాడు . ‘నన్ను ప్రేమించిన అమ్మాయిని నువ్వెలా పెళ్లి చేసుకుంటావు’ అంటూ వరుడిని నిలదీశాడు. అప్పటివరకు పెండ్లి అయిపోయి బరాత్ సంతోషంలో ఉన్న వధూవరుల కుటుంబాలు ఒక్కసారిగా షాక్‌‌కు గురయ్యాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటన సినిమా సీన్ ను తలపించింది. పెళ్లికొడుకు ఫిర్యాదు మేరకు బరాత్‌‌ను అడ్డుకున్న శ్రీపతి వంశీ అనే యువకుడిపై కేసు నమోదు చేశారు. వరుడు ప్రవీణ్ వధువును పోలీసు స్టేషన్‌‌లోనే వదిలేసి తన స్వగ్రామమైన మంచిర్యాల జిల్లా మందమర్రికి వెళ్లిపోయాడు. వధువు తల్లిదండ్రులు కూడా ఆమెను స్టేషన్‌‌లోనే వదిలి వెళ్లడంతో పోలీసులు కరీంనగర్‌‌లోని స్వధార్ హోంకు ఆమెను తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హుజురాబాద్ ఏసీపీ సుందరగిరి శ్రీనివాసరావు తెలిపారు.

For More News..

గర్భగుడి తాళం పగలకొట్టి గుళ్లో చోరీ

రాష్ట్రంలో కొత్తగా 3,018 కరోనా కేసులు

కరోనాతో జగిత్యాల అడిషినల్ ఎస్పీ మృతి