టీవీ షో నిర్వాహకులపై పరిణీతి చోప్రా సీరియస్

టీవీ షో నిర్వాహకులపై పరిణీతి చోప్రా సీరియస్

క్రేజ్ తగ్గిన స్టార్స్ మాత్రమే టీవీ షోస్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తారనేది పాత మాట. క్రేజ్ ఎక్కువ ఉన్నవాళ్లే టీవీషోలకు హోస్ట్‌‌‌‌‌‌‌‌లు, జడ్జీలుగా రావడం ప్రెజెంట్ ట్రెండ్. ఇప్పుడీ వరుసలో బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా కూడా చేరింది. ‘హునర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాజ్’ అనే షోతో ఆమె టీవీల్లోకి డెబ్యూ ఇస్తోంది. మిథున్ చక్రవర్తి, కరణ్‌‌‌‌‌‌‌‌ జోహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఈ టీవీ షోకు జడ్జిగా వ్యవహరిస్తోందామె. ఇప్పటికే ఈ రియాలిటీ షో షూటింగ్‌‌‌‌‌‌‌‌లోనూ పాల్గొంది. త్వరలోనే కలర్స్ టీవీలో ఇది టెలికాస్ట్ అవనుంది. అయితే మరో టీవీ షోకు కూడా ఆమె జడ్జిగా రాబోతోంది అంటూ ఇటీవల ‘ఫన్ కిడ్స్ ఇండియా’ అనే షో నిర్వాహకులు ఓ అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇచ్చారు. వాళ్లు తన పేరును తప్పుగా క్లెయిమ్ చేశారంటూ ఫైర్ అయింది పరిణీతి.

అందుకు సంబంధించిన ట్వీట్ స్క్రీన్‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌ని షేర్ చేస్తూ, ఆ సంస్థతో తాను అసోసియేట్ కాలేదని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు, వెంటనే పేరు తీసేయాలని, తన పేరు వాడటం ద్వారా పిల్లలు, వాళ్ల తల్లిదండ్రుల విషయంలో అడ్వాంటేజ్ తీసుకోవద్దు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో దిగొచ్చిన ఆ షో నిర్వాహకులు, పరిణీతి మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గత మూడు నెలలుగా టచ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నామని, అతి త్వరలో ఆమెను ఫేస్‌‌‌‌‌‌‌‌ టు ఫేస్ కలిసి మాట్లాడతామంటూ సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు. అయినా ఇంత జరిగాక మళ్లీ ఆ టీవీషోలో పరిణీతి కనిపించడం కష్టమే. ఇక ప్రస్తుతం అమితాబ్, అనుపమ్ ఖేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో కలిసి ‘ఊంచై’తో పాటు రణబీర్ కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి జంటగా ‘యానిమల్‌‌‌‌‌‌‌‌’లోనూ నటిస్తోంది పరిణీతి.