గ్రామసభల ద్వారానే పేదలకు సంక్షేమ పథకాలు : పర్నికారెడ్డి

గ్రామసభల ద్వారానే పేదలకు సంక్షేమ పథకాలు :  పర్నికారెడ్డి

మరికల్​, వెలుగు : గ్రామసభల ద్వారా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు పార్టీ కార్యకర్తలు కృషిచేయాలని నారాయణపేట ఎమ్మెల్యే పర్నికారెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రంలో కృతజ్ఞత సభకు ఆమె ముఖ్య​ అతిథిగా వచ్చారు. పార్టీ శ్రేణులు పని చేస్తేనే.. పేదలకు పథకాలు అందుతాయన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషిచేస్తామని హమీ ఇచ్చారు. 

గ్రామసభలను విపక్షాలు అడ్డుకునే ప్రయత్నాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. మరికల్​లోని 449 సర్వేనంబర్​ ప్రభుత్వ భూమి బాధితులు తమ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు బి.వీరణ్ణ, ఓబీసీ జిల్లా చైర్మన్​ గొల్ల కృష్ణయ్య, సూర్యమోహన్​రెడ్డి, కాంగ్రెస్​ మండల మహిళ అధ్యక్షురాలు వినితమ్మ పాల్గొన్నారు.