టర్కీలో బోటు ప్రమాదం.. 287 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా 

టర్కీలో బోటు ప్రమాదం.. 287 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా 

టర్కీలో ప్రయాణికులతో వెళ్తు్న్న ఫెర్రీ బోల్తా పడింది. మెర్సిన్ ప్రావిన్స్ లోని నార్త్ సైప్రస్ లో ప్రయాణికులతో వెళ్తున్న బోటు అదుపుతప్పి సముద్రంలో బోల్తాపడింది. నౌకలో  ప్రయాణిస్తున్న ప్రయాణీకులు, సిబ్బంది సంఖ్యపై స్పష్టత లేదు. ప్రమాద సమయంలో 267 నుంచి 287 మంది ప్రయాణికులు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ప్రయాణికుల్లో ఆరుగురు మృతిచెందినట్లు సమాచారం. కోస్ట్‌గార్డ్ నౌకలు, హెలికాప్టర్లు, ప్రైవేట్ బోట్లతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.