పాట్నా ఎయిమ్స్ లో కరోనా వ్యాక్సిన్  క్లినికల్ ట్రయల్స్

పాట్నా ఎయిమ్స్ లో కరోనా వ్యాక్సిన్  క్లినికల్ ట్రయల్స్

హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ కు రెడీ అయ్యింది. పాట్నా ఎయిమ్స్ లో నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు 18 మంది వలంటీర్లను కూడా భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఎంపిక చేసింది. వీరంతా 18 నుంచి 55 ఏళ్ల వయసున్న వారు. మొదట వీరందరికీ పూర్తిస్థాయిలో మెడికల్ చెకప్ నిర్వహిస్తారు. వారి వైద్య పరీక్షల నివేదికలను పూర్తిగా పరిశీలించి ఆపై వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతులు మంజూరు చేస్తారు.

ఈ వలంటీర్లకు వ్యాక్సిన్ మొదటి డోసు ఇచ్చిన తర్వాత రెండు మూడు గంటల పాటు పరిశీలనలో ఉంచుతారు. క్లినికల్ ట్రయల్ పూర్తి కావాలంటే మూడు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా 12 వైద్య సంస్థలను ఎంపిక చేసింది. వాటిలో పాట్నా ఎయిమ్స్ ఒకటి. హైదరాబాద్ లోని నిమ్స్ వైద్య సంస్థ కూడా క్లినికల్స్ ట్రయల్స్ కు ఎంపికైంది.