హైదరాబాద్, వెలుగు: ముషీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో హర్యానా రాష్ట్రానికి చెందిన 339 బాటిల్ల అక్రమ మద్యంను స్వాధీనం చేసుకొని రాష్ట్రంలో మొదటిసారి పీడీ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
జార్ఖండ్కు చెందిన రాజారామ్ సింగ్ దగ్గర అక్రమ మద్యంను స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్లో శనివారం ఆయన వెల్లడించారు. ఎక్సైజ్శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి అక్రమ మద్యం నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు చెప్పారు.
అక్రమంగా మద్యంను సరఫరా చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ పెట్టనున్నట్లు ఆదేశించారు. ఎయిర్ పోర్టు రైల్వే బస్సు, పార్సల్ సర్వీసులపై నిఘా పెడుతున్నట్లు వివరించారు.