హైదరాబాద్, వెలుగు: ఏడాది నుంచి టీచర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ వెంటనే రిలీజ్ చేయాలనీ టీచర్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి డిమాండ్ చేశారు. సరెండర్ లీవ్స్, మెడికల్, జీపీఎఫ్ తదితర బిల్లులను ఆమోదించి టీచర్ల ఖాతాల్లో జమ చేయాలని కోరారు.
గురువారం పీఆర్టీయూ ఆఫీసులో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కూర రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ టీచర్లు జీపీఎఫ్ నుంచి తమ అవసరాల కోసం లోన్లు పొందినా ఆ బిల్లులు నగదుగా మారడం లేదన్నారు. దీంతో టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.