టీచర్ల పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలె..ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి

టీచర్ల పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలె..ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి

హైదరాబాద్, వెలుగు:  ఏడాది నుంచి టీచర్లకు సంబంధించి పెండింగ్​లో ఉన్న  బిల్లులన్నీ వెంటనే రిలీజ్ చేయాలనీ టీచర్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి డిమాండ్ చేశారు. సరెండర్ లీవ్స్, మెడికల్, జీపీఎఫ్​ తదితర బిల్లులను ఆమోదించి టీచర్ల ఖాతాల్లో జమ చేయాలని కోరారు.  

గురువారం పీఆర్టీయూ ఆఫీసులో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కూర రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ టీచర్లు జీపీఎఫ్ నుంచి తమ అవసరాల కోసం లోన్లు పొందినా ఆ బిల్లులు నగదుగా మారడం లేదన్నారు. దీంతో టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.