హైదరాబాద్ లో ఘరానా మోసం...రాత్రికిరాత్రే రూ.150 కోట్లతో జంప్

హైదరాబాద్ లో ఘరానా మోసం...రాత్రికిరాత్రే  రూ.150 కోట్లతో జంప్

హైదరాబాద్ లో మరో స్టాక్ మార్కెట్ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక లాభాల ఆశ చూపి వందల మందిని బురిడీ కొట్టించింది ఓ సంస్థ. కస్టమర్లకు అధిక లాభాల ఆశ చూపి ఏకంగా 150 కోట్లు కాజేసి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది సంస్థ. 

కుత్బుల్లాపూర్  పరిధిలోని జీడిమెట్ల, చింతల్ లో ఈ ఘరానా మోసం బయటపడింది.  పెంగ్విన్ సెక్యూరిటీ అనే సంస్థ పేరిట బాండ్ ల రూపంలో  కస్టమర్లను మోసం చేసింది. ఇన్వెస్ట్ చేసిన రూపాయలకు అధిక వడ్డీతో ఇస్తామని ఆశ చూపించి  1500మంది కస్టమర్ల నుంచి దాదాపు  రూ. 150 కోట్లు కొల్లగొట్టిరాత్రికి రాత్రే బిచానా ఎత్తేశారు  కంపెనీ నిర్వాహకులు. మోసపోయామని గ్రహించిన బాధితులు కుత్బుల్లాపూర్  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

►ALSO READ | హోటల్లో బిర్యానీ తిన్న తర్వాత 8 ఏళ్ల బాలుడు మృతి

ఈ మధ్య ఆన్ లైన్ లో  మోసాలు, ఉద్యోగాల పేరుతో లక్షలు దండుకోవడం..అధిక వడ్డీల పేరుతో డబ్బులు కాజేయడం వంటి ఘటనలు  రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో భారీగా మోసపోతున్నారు బాధితులు. అమాయకులే లక్ష్యంగా అందినకాడికి దోచుకుని పరారవుతున్నారు కేటుగాళ్లు.