హోటల్లో బిర్యానీ తిన్న తర్వాత 8 ఏళ్ల బాలుడు మృతి

హోటల్లో బిర్యానీ తిన్న తర్వాత 8 ఏళ్ల బాలుడు మృతి

కోయంబత్తూరులో విషాదం నెలకొంది. ఎనిమిదేళ్ల బాలుడు బిర్యానీ తిని మృతిచెందాడు. హోటల్ నుంచి కొనుగోలు చేసిన బిర్యాని తిన్న తర్వాత బాలుడు అస్వస్థతకు గురికాగా.. చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే..

తమిళనాడులోని కోయంబత్తూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం(మే29) రాత్రి శరవణంపట్టిలోని ఒక హోటల్ నుండి కొనుగోలు బిర్యానీని కుటుంబ సభ్యులతో కలిసి తిన్న ఎనిమిదేళ్ల బాలుడు శుక్రవారం ఉదయం శవమై కనిపించాడు. 

శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో అతని తండ్రి సత్యప్రభు అతన్ని నిద్ర లేపడానికి ప్రయత్నించగా సంజీవ్ శరీరంలో ఎటువంటి కదలిక లేదు. వెంటనే అతన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతనిని పరీక్షించి బాలుడిని కోయంబత్తూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి (CMCH)కి తీసుకెళ్లమని కోరారు. బాలుడిని పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. 

►ALSO READ | హోటల్ రిసెప్షనిస్ట్ హత్య కేసులో మాజీ బీజేపీ నేత కొడుక్కి జైలు శిక్ష..

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రి (CMCH)కి పంపారు. శరవణంపట్టి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాతే మరణానికి అసలు కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.