హోటల్ రిసెప్షనిస్ట్ హత్య కేసులో మాజీ బీజేపీ నేత కొడుక్కి జైలు శిక్ష..

హోటల్ రిసెప్షనిస్ట్ హత్య కేసులో మాజీ బీజేపీ నేత కొడుక్కి జైలు శిక్ష..

2022లో ఉత్తరాఖండ్ లో సంచలనం రేపిన హోటల్ రిషెప్సనిస్ట్ హత్య కేసులో శుక్రవారం ( మే 30 ) సంచలన తీర్పు వెల్లడించింది ఉత్తరాఖండ్ కోర్టు. ఈ కేసులో బీజేపీ మాజీ నేత కొడుకు పుల్కిత్ ఆర్యతో పాటు మరో ఇద్దరు సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తాలను దోషులుగా నిర్ధారించింది కోర్టు.పౌరి జిల్లాలోని యమకేశ్వర్ ప్రాంతంలో రిసార్ట్‌లో పనిచేస్తున్న అంకితను హత్య చేసిన ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చింది కోర్టు. 

సెప్టెంబర్ 18, 2022న కనిపించకుండా పోయినట్లు కేసు నమోదయ్యింది... కొన్ని రోజుల తర్వాత, ఆమె మృతదేహాన్ని చిల్లా కాలువలో గుర్తించారు పోలీసులు. ఈ సంఘటన అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ముందస్తు దర్యాప్తులో వైఫల్యం, రాజకీయ ఒత్తిడి కారణంగా కేసు పక్కదోవ పట్టిస్తున్నారంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. 

ఈ కేసులో 97 సాక్షులుగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్ బృందం... వీరిలో 47 మంది పేర్లను మార్చి 28, 2023న తొలగించారు. పుల్కిత్ ఆర్య మరియు మరో ఇద్దరు నిందితులపై భారత్ న్యాయ సంహిత సెక్షన్లు 302, 201, 354A, అక్రమ రవాణా చట్టం, గ్యాంగ్‌స్టర్ చట్టం కింద దోషులుగా తేల్చింది కోర్టు.

పార్టీ నుండి సస్పెండ్ అయిన బిజెపి నాయకుడు వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య, రిసార్ట్‌లో క్లయింట్లకు స్పెషల్ సర్వీస్ అందించాలంటూ అంకిత భండారిపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.అంకిత భండారి సెప్టెంబర్ 18, 2022న కనిపించకుండా పోయినట్లు కేసు నమోదయ్యింది. ఆ సాయంత్రం, రాత్రి 8 గంటల ప్రాంతంలో, ఆమె పుల్కిత్ ఆర్య, రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, మరొక ఉద్యోగి అంకిత్ అలియాస్ పుల్కిత్ గుప్తాతో కలిసి రిషికేశ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. 

రిషికేష్ నుండి తిరిగి వచ్చే సమయంలో నలుగురు చిలా రోడ్డులో ఉన్న ఒక కాలువ దగ్గర ఆగినట్లు తెలుస్తోంది, అక్కడ నిందితులు ముగ్గురు మద్యం సేవించి, అంకితను లైంగికంగా వేధించగా అంకిత తిరస్కరించడంతో ఆగ్రహించిన ముగ్గురు నిందితులు ఆమెను కాలువలోకి తోసేసి చంపినట్లు తెలుస్తోంది.