డ్రైనేజీ నాలాను పూడ్చాలంటూ బీజేపీ నాయకుల ధర్నా

డ్రైనేజీ నాలాను పూడ్చాలంటూ బీజేపీ నాయకుల ధర్నా

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ పరిధిలోని 23వ వార్డులో అసంపూర్తిగా ఉన్న నాలాను పూర్తి చేయకుండా వదిలేశారు. లారీలతో మట్టిని పోసి నాలాను మూసివేయడానికి ప్రయత్నిస్తుండగా.. బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. లారీలోని మట్టిని పోయకుండా అడ్డుకుని రోడ్డుపై బైటాయించి ధర్నా నిర్వహించారు. 

ఎస్ఎన్‭డిపి పనుల పేరుతో నిధులను దుర్వినియోగం చేసి.. ప్లానింగ్ లేకుండా డ్రైనేజీ నాలాను అసంపూర్తిగా నిర్మించడం దుర్మార్గమని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ నాలాను అసంపూర్తిగా వదిలేయడం వల్ల పలు కాలనీలో ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం సమయంలో వర్షపు నీరు, మురికి నీరు చేరడంతో అవి ఎక్కడా పోలేక ఈ నాలా పొంగే ప్రమాదం ఉందన్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా మంత్రి సబితా రెడ్డి, మున్సిపల్ కమిషనర్ స్పందించి ఈ నాలకు పరిష్కారం చూపాలని బీజేపీ నాయకులు కోరారు.