దేశంలో సగం పల్లెల్లో తక్కువ తింటున్నారు

దేశంలో సగం పల్లెల్లో తక్కువ తింటున్నారు

న్యూఢిల్లీలాక్​డౌన్​ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో జనం తినే తిండి బాగా తగ్గిపోయింది. లాక్​డౌన్​ మొదలైన తర్వాత రూరల్​ ఏరియాల్లో 50 శాతం కుటుంబాలు గతంలో కంటే తక్కువ ఆహారం తీసుకుంటున్నట్టు తాజా సర్వేలో వెల్లడయ్యింది. ‘కోవిడ్​ 19 ఇన్​డ్యూస్డ్​ లాక్​డౌన్–హౌ ఈజ్​ హింటర్​లాండ్​ కోపింగ్’​ పేరిట 47 జిల్లాల్లో ఈ స్టడీ నిర్వహించారు. 12 రాష్ట్రాల్లోని 5 వేల కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు. బుధవారం వెబినార్​లో ఈ స్టడీ వివరాలను రిలీజ్​ చేశారు. అస్సాం, బీహార్, ఛత్తీస్​గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్​ రాష్ట్రాల్లో ఈ సర్వే చేశారు.

పీసీఎస్​ స్కీంపైనే ఆధారపడ్డరు

50 శాతం ఫ్యామిలీలు భవిష్యత్​ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తాము తీసుకునే తిండిని తగ్గించుకున్నాయి. 68 శాతం కుటుంబాలు తాము తినే ఆహారంలో ఐటమ్స్​ను తగ్గించాయి. ఈ సర్వే ప్రకారం 84 శాతం కుటుంబాలు పబ్లిక్​ డిస్ట్రిబ్యూషన్​ సిస్టం ద్వారా ఆహార పదార్థాలను అందుకున్నాయి. 37 శాతం కుటుంబాలు తమ ఇంటి దగ్గరే రేషన్​ తీసుకున్నాయి. 24 శాతం కుటుంబాలు తమ గ్రామంలోని ఇతరుల నుంచి అప్పు తెచ్చుకున్నాయి. 12 శాతం కుటుంబాలు  ఫ్రీగా ఫుడ్‌ను అందుకున్నాయి. రబీ కంటే ఖరీఫ్ పంట పైనే జనం ఎక్కువగా ఆధారపడ్డారని, అయితే ప్రస్తుతం ఆహార ధాన్యాల నిల్వ తగ్గిపోయిందని ఈ స్టడీ వెల్లడించింది. ‘‘చాలా కుటుంబాలు తీసుకునే ఫుడ్‌ను తగ్గించాయి. తినే టైమ్​ను కూడా తగ్గించుకున్నాయి. ఎక్కువ మంది తమ అవసరాలకు పీడీఎస్​పైనే ఆధారపడ్డారు”అని ఈ స్టడీ తెలిపింది.

ప్రభుత్వ సాయం అవసరం

2020 ఖరీఫ్ కు సంబంధించి సన్నద్ధత తక్కువగా ఉందని, పంట వేసేందుకు అవసరమైన విత్తనాలు, రుణాల కోసం ప్రభుత్వ సహాయం అవసరమని ఈ స్టడీ అభిప్రాయపడింది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో వలస కూలీలు తమ సొంతూర్లకు వెళుతూనే ఉన్నారని తెలిపింది. ‘‘లాక్​డౌన్, రూమర్లు డెయిరీ, పౌల్ట్రీ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో వాటి ఆదాయం తగ్గిపోయింది. వీటి వల్ల ఆహార అలవాట్లలో మార్పులు వచ్చాయి. జనం ఖర్చులను తగ్గించుకున్నారు” అని తెలిపింది.

మరిన్ని సర్వేలు జరగాలి

సివిల్​ సొసైటీ ఆర్గనైజేషన్లు ప్రధాన్, యాక్షన్ ఫర్ సోషల్​ అడ్వాన్స్​మెంట్, బీఏఐఎఫ్, ట్రాన్స్​ఫార్మ్​ రూరల్​ ఇండియా ఫౌండేషన్, గ్రామీణ్​ సహారా, సాతీ–యూపీ, అగా ఖాన్ రూరల్​ సపోర్ట్​ ప్రోగ్రాంతో పాటు వికాశ్​ అన్వేష్​ ఫౌండేషన్, సంబోధితో కలిసి ఈ స్టడీ నిర్వహించాయి. వెబినార్​ లో ప్రధాన్​ ప్రోగ్రాం డైరెక్టర్ మధు ఖేతన్ మాట్లాడుతూ.. తమకు అవకాశం ఉన్న చోట్ల మాత్రమే ఈ స్టడీ నిర్వహించామని, రిమోట్​ గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. బీఏఐఎఫ్​ ప్రెసిడెంట్​ గిరిష్​ సోహానీ మాట్లాడుతూ.. ఆరోగ్యానికి సంబంధించి కూడా అనేక విషయాలు తమ దృష్టికి వచ్చాయని, ఇలాంటి మరిన్ని సర్వేలు జరిగితేనే గ్రౌండ్​ లెవెల్​లో పరిస్థితి అర్థమవుతుందని చెప్పారు.

17 తర్వాత జిమ్‌ లు,గోల్ఫ్ కోర్సులు ఓపెన్