జగిత్యాల జిల్లా: స్మశాన వాటిక స్థలం వివాదంపై రెండు గ్రామాల ప్రజలు కొట్టుకున్న సంఘటన శుక్రవారం అర్థరాత్రి జగిత్యాల జిల్లాలో జరిగింది. స్మశాన వాటికకు స్థలం కేటాయింపుపై మెటపల్లి మండలం రంగారావుపేట, కేసీఆర్ తండా గ్రామాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో గురువారం రాత్రి నుంచే గొడవకు దిగారు.
మాటామాటా పెరగడంతో అర్ధరాత్రి ఘర్షణకు దిగారు రెండు గ్రామాల ప్రజలు. దీంతో పదిమందికి పైగా తీవ్ర గాయాలు కాగా.. వారిని హస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు గ్రామస్థులు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ విషయంపై రెండు గ్రామాల సర్పంచ్ లతో చర్చిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.