చెన్నై: 2021 ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు పెద్ద అద్భుతాన్ని సృష్టించబోతున్నారని సూపర్స్టార్ రజనీకాంత్ అన్నారు. ఐఎఫ్ఎఫ్ఐ కార్యక్రమం ముగిసిన తర్వాత రజనీకాంత్ చెన్నైలో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో మహాద్భుతం జరుగుతుందని అన్నారు. కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యంతో పొత్తు పెట్టుకునే ఆలోచన ఉందని, ఆ తర్వాతే సీఎం అభ్యర్థి ఎవరన్నది నిర్ణయిస్తామని రజనీ తెలిపారు.
తోటి నటుడు రజనీకాంత్ పార్టీతో కలిసి పని చేస్తామని, తమిళనాడు అభివృద్ధికి పాటుపడతామని మక్కాల్ నీది మయ్యం పార్టీ నాయకుడు కమల్ హాసన్ రెండు రోజుల క్రితం మీడియాతో అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రజనీ.. కమల్ హాసన్తో పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉంటే ప్రజల ప్రయోజనం కోసం ఖచ్చితంగా కలిసి వస్తామని, గత 44 సంవత్సరాల నుంచి తమ ఇద్దరి మధ్య మంచి స్నేహాం ఉందని అన్నారు. అవసరమైతే రాష్ట్రాభివృద్ధికి తాము ఒక్కటై పోతామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.