రుద్రాక్ష, లిచీ పండిస్తున్నడు

రుద్రాక్ష, లిచీ పండిస్తున్నడు

పట్టుదల ఉంటే కానిది లేదు. ఆ పట్టుదలకి కాస్త ఓపిక తోడైతే సాధించలేనిది అంటూ ఉండదు. అదే నిరూపించాడు ఈ రిటైర్డ్​ గవర్నమెంట్​ ఎంప్లాయి​. మంచుతో నిండిన హిమాలయాలు, నేపాల్​, హరిద్వార్​.. లాంటి ప్రాంతాల్లో మాత్రమే దొరికే రుద్రాక్ష చెట్లని తెలంగాణకి తీసుకొచ్చాడు.16 ఏండ్లుగా వాటిని కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఇప్పుడు ఆ చెట్లు కాయలు కాస్తున్నాయి. రుద్రాక్ష చెట్లే కాకుండా అరుదైన మొక్కలెన్నింటినో తన తోటలో పెంచుతున్నాడు ఈ పెద్దాయన. అది కూడా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో. ప్రకృతి వ్యవసాయంతో ఎంతోమందికి ఇన్​స్పిరేషన్​గా నిలుస్తున్న ఇతని పేరు ఆకుల లక్ష్మయ్య.