జవహర్ నగర్ లో దారుణ హత్య... పెట్రోల్ పోసి అత్యంత కిరాతకంగా..

జవహర్ నగర్ లో దారుణ హత్య... పెట్రోల్ పోసి అత్యంత కిరాతకంగా..

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జవహర్ నగర్ లో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కౌకూర్ వికలాంగుల కాలనీలోని నిర్మానుష్య ప్రదేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యక్తిని దారుణంగా చంపి.. మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు ఆనవాళ్లున్నయని స్థానికులు చెబుతున్నారు. చుట్టుపక్కలవారు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. 

నిన్న(జనవరి 27) రాత్రి సమయంలో ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. చనిపోయిన వ్యక్తి వయసు 40 సంవత్సరాలు ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు. వ్యక్తిని ఎక్కడో చంపేసి.. ఇక్కడికి తీసుకువచ్చి కాల్చినట్లు తెలుస్తోందని చెప్పారు. హత్య చేసి నీలి రంగు కవర్ లో మృతదేహాన్ని తీసుకువచ్చి మృతదేహాన్ని కాల్చినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 80 శాతం కాలిన గాయాలతో మృతదేహం గుర్తించలేని స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల అదృశ్యమైన కేసులకు సంబంధించి అన్ని కోణాలలో దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు కుషాయి గూడ ఏసీపీ రవీందర్.