ధాన్యం కొనుగోలు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్

ధాన్యం కొనుగోలు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా ఉండడం తో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ  లా విద్యార్ధి బొమ్మనగరి శ్రీకర్ పిల్ దాఖలు చేశారు. ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్నారు. పిటిషన్ పై విచారణ చేపట్టి కోర్టు.. ఏ చట్ట ప్రకారం ధాన్యం కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలో చెప్పాలంది. ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కోర్టుకు తెలిపిన అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్. కేంద్రం ప్రకటించిన కనీసం మద్దతు ధర రైతులకు అందేలా చూడాలన్న పిటిషనర్. ధాన్యం దళారుల దోచుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే ఆదేశాలు ఇవ్వాలన్నారు శ్రీకర్. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తూ చనిపోయిన 700 రైతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణ కావొచ్చన్న హైకోర్టు..పత్రికల కథనం ప్రకారం ధర్నా లో చనిపోయిన ప్రతి రైతు కుటుంబాలకు 3 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పింది. జనవరి చివరి వరకు ధాన్యం కొనుగోలు చేస్తూనే ఉంటామని తెలిపిన ఏజీ. ఏజీ వాదనను పరిగణనలోకి తీసుకుని ధాన్యం కొనుగోలు కు అన్ని ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశాలు జారీ చేసింది.

జనవరి మూడవ వారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి  సూచించింది హైకోర్టు.