హైదరాబాద్, వెలుగు: గేమ్ పాయింట్ ఆధ్వర్యంలో సిటీలో ఈ నెల 16, 17వ తేదీల్లో పికిల్ బాల్ చాంపియన్షిప్ జరగనుంది. హైటెక్ సిటీలోని గేమ్ పాయింట్ కోర్టుల్లో మెన్స్ డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ , 35+ మెన్స్ డబుల్స్ అనే మూడు కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తామని గేమ్ పాయింట్ సహ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ రెడ్డి తెలిపారు.
ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఈ నెల 13వ తేదీలోపు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. వివరాలకు 7032 777 333 నంబర్ ను సంప్రదించాలని సూచించారు. క్రీడాకారులకు నిర్వాహకులే పికిల్బాల్ రాకెట్లు/పాడిల్స్ అందిస్తారన్నారు.