భోజనంలో గాజుముక్క .. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు

భోజనంలో గాజుముక్క .. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు

 సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట శివార్లలోని నాగుల బండ వద్ద హోటల్ భోజనంలో గాజు ముక్క రావడంతో ఫుడ్​సేఫ్టీ అధికారులు ఆహార పదార్థాల్ని సీజ్ చేశారు. గజ్వేల్ కు చెందిన జహంగీర్ తన అడ్వకేట్ తో కలిసి మంగళవారం మధ్యాహ్నం హోటల్లో భోజనం చేయడానికి వెళ్లాడు. భోజనం చేస్తుండగా అతడి నోట్లో ఏదో గట్టిగా గుచ్చుకుంది. దాన్ని బయటికి తీసి చూస్తే రెండంగుళాల గాజు ముక్క అని తెలిసింది. హోటల్ సిబ్బందిని ప్రశ్నిస్తే వారు స్పందించలేదు. దాంతో జహంగీర్​ ఫుడ్ సేఫ్టీ అధికారి అనూషకు ఫిర్యాదు చేయగా.. అక్కడికి చేరుకుని ఫుడ్​ సీజ్ చేసి వంట గదిని తనిఖీ చేశారు.