మోడీ సర్కార్ నిర్లక్ష్యమే కొంప ముంచింది

మోడీ సర్కార్ నిర్లక్ష్యమే కొంప ముంచింది

కోల్‌‌కతా: కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు మోడీ సర్కార్ నిర్లక్ష్యమే కారణమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. కరోనా పరిస్థితులను అర్థం చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యిందని, సర్కార్ నిర్లక్ష్యమే కొంప ముంచిందని పీకే దుయ్యబట్టారు. కరోనా సమస్యపై మోడీ సర్కార్‌కు అవగాహన, దూరదృష్టి లోపించాయని విమర్శించారు. సమస్య పెద్దదయ్యాక స్పందించడం, గెలిచనప్పుడు ప్రజల దగ్గర బుకాయించడం సరికాదని దుయ్యబట్టారు. ఒకవేళ సమస్య పెద్దదయితే దాన్ని ఇతరుల మీదకు నెడుతున్నారంటూ మోడీపై ఫైర్ అయ్యారు. ప్రాబ్లమ్ పరిష్కారమైతే క్రెడిట్ కొట్టేసేందుకు భక్తుల ఆర్మీతో తిరిగి వస్తున్నారని ట్వీట్‌‌లో ఆరోపించారు.