యష్, రిషబ్ శెట్టిలతో ప్రధాని మోడీ విందు

యష్, రిషబ్ శెట్టిలతో ప్రధాని మోడీ విందు

బెంగళూరు పర్యటనలో ప్రధాని మోడీ.. పలువురు సినీ నటులు, క్రికెటర్లను కలిశారు. యెలహంకలోని ఎయిర్ స్టేషన్‌లో ఏరో ఇండియా షోను ప్రారంభించేందుకు ప్రధాని బెంగళూరు విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి కన్నడిగుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో మోడీతో పాటు దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని రాజ్‌కుమార్, కన్నడ స్టార్ నటులు యష్, రిషబ్ శెట్టిలు పాల్గొన్నారు. క్రికెటర్లు మయాంక్ అగర్వాల్, మనీష్ పాండే కూడా అక్కడ ఉన్నారు. అనంతరం రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ప్రధాని మోడీ వారితో కొద్దిసేపు ముచ్చటించారు. కన్నడ సినిమా, కర్నాటక సంస్కృతి, క్రీడలు, వ్యాపార అవకాశాలు వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. సాంస్కృతిక గుర్తింపును పెంపొందించడం, సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వడం పై వారిని ప్రత్యేకంగా అభినందించారు.