పార్లమెంట్ లో స్మోక్ అటాక్.. దురదృష్టకరమైన, ఆందోళన కలిగించే ఘటన : మోదీ

పార్లమెంట్ లో స్మోక్ అటాక్.. దురదృష్టకరమైన, ఆందోళన కలిగించే ఘటన : మోదీ

పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని, ఆందోళన కలిగించే ఘటన అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా అత్యంత సీరియస్‌గా తీసుకున్నారని, అవసరమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు. పార్లమెంటులో జరిగిన ఘటన తీవ్రతను ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదని ప్రధాని మోదీని ఉద్ఘాటించారు. దర్యాప్తు సంస్థలు సమగ్ర విచారణను నిర్వహిస్తున్నాయని చెప్పారు.

ఈ ఘటన వెనుక ఉన్న అంశాలు, ప్రణాళికలు ఏమిటో అర్థం చేసుకోవడం, పరిష్కారాన్ని కనుగొనడం చాలా ముఖ్యమని, పరిష్కారాల కోసం ఓపెన్ మైండ్‌తో ఆలోచన చేయాలని ప్రధాని మోదీ చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాలపై వివాదాలు, ప్రతిఘటనలకు దూరంగా ఉండాలని కోరారు.