ఇందిరా గాంధీ బోధనలు ప్రేరణగా నిలుస్తాయి

ఇందిరా గాంధీ బోధనలు ప్రేరణగా నిలుస్తాయి

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ నేతలు ఆమెను స్మరించుకున్నారు. ఇందిరను గుర్తు చేసుకుంటూ ప్రధాని మోడీతోపాటు కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ట్వీట్లు చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి నివాళి అంటూ మోడీ పేర్కొన్నారు.

‘కార్యదక్షత కలిగిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమెకు శ్రద్ధాంజలి తెలియజేస్తున్నా. మొత్తం దేశం ఆమె ప్రభావవంతమైన నాయకత్వాన్ని ఇవ్వాళ్టికి స్మరించుకుంటోంది. నేను మాత్రం ఆమెను నా ప్రియతమ నాన్నమ్మలానే గుర్తుంచుకుంటా. ఆమె నేర్పిన బోధనలు నాకెప్పుడూ ప్రేరణగా నిలుస్తాయి’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ కూడా ఇందిరా గాంధీ మెమోరియాల్ మ్యూజియం వద్ద నివాళి అర్పించారు.