న్యూఢిల్లీ: ఇరాన్, రష్యా విదేశాంగ మంత్రులు అబ్బాస్ అరాఘ్చీ, సెర్గీ లవ్ రోవ్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం గురువారం ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆ ఇద్దరు విదేశాంగ మంత్రులతో మోదీ సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో యుద్ధంతో పాటు పలు అంతర్జాతీయ అంశాలపై వారు చర్చించారు.
అనంతరం విదేశాంగ మంత్రులను ఉద్దేశిస్తూ అరాఘ్చీ మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రపంచ దేశాలపై యూఎస్ ఒత్తిడి పెరిగిందని, ఇతర దేశాల వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ఒత్తిడికి ఇరాన్ ప్రతిఘటించడం ఈ సమావేశంలో పాల్గొన్న దేశాలకు కొత్త కాదన్నారు. కాగా.. శుక్రవారం కూడా బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల భేటీ జరగనుంది.
