ఢిల్లీ: ప్రధాని మోడీ, సోనియా గాంధీ నమస్కారం ఫొటో మరోసారి వైరల్ అవుతోంది. గురువారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఓం బిర్లా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీని కలిసిన సోనియా నమస్కారం చేస్తుండగా ప్రధాని పక్కకు చూస్తున్నారు. మోడీ ఎక్స్ ప్రెషన్స్ అదోలా ఉన్నాయంటూ ట్విట్టర్ లో పలువురు ఆరోపణలు చేస్తున్నారు. సోనియా అంటే మోడీకి అంత చిన్న చూపు ఏంటని ట్వీట్లు వదులుతున్నారు. గతంలోనూ 2014లో ఢిల్లీలోని రావణ్ దహన్ లో జరిగిన దసరా ఉత్సవాల్లో మోడీకి సోనియా నమస్కారం పెడుతుండగా పక్కకు చూశారంటూ అప్పటి ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఇద్దరి మధ్యన ఇంత విభేదాలా అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని మోడీ ఉద్దేశపూర్వకంగా చేసి ఉండరని మరికొందరు రీట్వీట్స్ వదులుతున్నారు. మొత్తానికి మరోసారి మోడీ, సోనియాల నమస్కారం ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ప్రధాని, సోనియా ఎలా స్పందిస్తారో చూడాలి.
41 ఏండ్లలో 60 కేసులు పెట్టుకున్న భార్యాభర్తలు
నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు ఇబ్బంది కాలేదు
Delhi | Prime Minister Narendra Modi, Defence Minister Rajnath Singh, Lok Sabha Om Birla met Congress chief Sonia Gandhi and other Opposition leaders after the conclusion of Parliament's Budget session today. pic.twitter.com/acsjqd3bZN
— ANI (@ANI) April 7, 2022
#Dussehra festivities | Modi, Singh, Sonia share stage at Ravan Dahan in Delhi http://t.co/LFCMRFHdfm #ht pic.twitter.com/uuOcjJjxc2
— Hindustan Times (@htTweets) October 3, 2014