ప్రధాని మోదీ కొత్తగా కనిపించారు. ఆర్మీ దుస్తుల్లో అదరగొట్టారు. బెంగళూరులో ఆయన యుద్ధ విమానం తేజాస్ లో ప్రయాణించారు. యుద్ధ విమానంలో ఆయన ప్రయాణించిన అనుభవాలను ఎక్స్ (ట్విట్టర్)లో పంచుకున్నారు మోదీ.
Successfully completed a sortie on the Tejas. The experience was incredibly enriching, significantly bolstering my confidence in our country's indigenous capabilities, and leaving me with a renewed sense of pride and optimism about our national potential. pic.twitter.com/4aO6Wf9XYO
— Narendra Modi (@narendramodi) November 25, 2023
తేజాస్ లో ప్రయాణిస్తున్నప్పుడు గర్వంగా ఫీలయినట్లు చెప్పుకొచ్చారు. భారతదేశ స్వావలంభన, రక్షణ రంగంలో పురోగతికి నిదర్శనంగా అభివర్ణించారు. ప్రపంచంలో భారత్ ఎందులోనూ తక్కువ కాదని.. నా ప్రయాణం అనుభవంలో తెలిసొచ్చిందన్నారు. మన వైమానిక దళం, డీఆర్ డీవో, హాల్(HAL) సమన్వయంతో యుద్ధ విమానాల ఇంజిన్ల తయారీలో ప్రపంచ దేశానికి ఆదర్శంగా ఉందన్నారు మోదీ.
రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ణానం అభివృద్ధిలో భాగంగా.. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 36 వేల కోట్ల రూపాయల బడ్జెట్ అంచనాలతో తేలికపాటి యుద్ధ విమానాలను తయారు చేస్తుంది. ఈ ప్రాజెక్టు పరిశీలినలో భాగంగా.. ఆయన బెంగళూరులోని హెచ్ఏఎల్ సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా 45 నిమిషాలపాటు తేజాస్ యుద్ధ విమానంలో ప్రయాణించి రికార్డ్ సృష్టించారు.