
జీ20 సదస్సులో ఆఫ్రికా యూనియన్కు శాశ్వత సభ్యత్వం లభించింది. ఈ విషయాన్ని ప్రకటించిన ప్రధాని మోదీ.. ఆఫ్రికా యూనియన్ అధినేత అజలి అసౌమనిని సాదరంగా గ్రూప్లోకి స్వాగతించారు. ఆయనను అభినందించి సభ్య దేశాలకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు.
50 దేశాలతో కూడిన ఆఫ్రికన్ యూనియన్ ను శాశ్వత మెంబర్ గా చేర్చే ప్రతిపాదనను ప్రధాని మోదీ సదస్సులో ప్రకటించగా, దీనికి అన్ని సభ్య దేశాలూ స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా అజలి అసౌమనిని .. మోదీ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని ట్వీట్ చేశారు. ‘‘జీ20 కుటుంబంలోకి శాశ్వత సభ్యురాలిగా ఆఫ్రికన్ యూనియన్ ను ఆహ్వానిస్తున్నాను. ఇది జీ20ని బలోపేతం చేస్తుంది. అలాగే, అంతర్జాతీయంగా దక్షిణాది స్వరం బలపడుతుంది’’అని ట్వీట్ చేశారు.
సదస్సు ప్రారంభానికి ముందు మొరాకోలో సంభవించిన భారీ భూకంపంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మొరాకోకు భారత్ అండగా ఉంటుందని ఆపన్న హస్తం అందించారు.