TSPSC Paper leak : లవర్ కోసం రూ. 6 లక్షలకు డీఏఓ పేపర్ కొన్నాడు

TSPSC Paper leak : లవర్ కోసం రూ. 6 లక్షలకు డీఏఓ పేపర్ కొన్నాడు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఏ1 నిందితుడు ప్రవీణ్ దగ్గర నుంచి సాయి లౌకిక్ అనే వ్యక్తి తన ప్రియురాలు సాయి సుష్మిత కోసం రూ.6 లక్షలకు డీఏఓ పేపర్ కొన్నట్లు సిట్ అధికారులు నిర్దారించారు. ఇవాళ (ఏప్రిల్ 7) జరిగిన సిట్ విచారణలో నిందితుడు ప్రవీణ్ లౌకిక్ కు డీఏఓ పేపర్ అమ్మినట్లు తెలిపాడు. 

దాంతో ఆ ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న సిట్.. విచారణ చేపట్టింది. సిట్ విచారణలో డీఏఓ పేపర్ కొన్నట్లు నిందితులు అంగీకరించారు. దాంతో పోలీసులు లౌకిక్, సుష్మితలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దీంతో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టు అయిన వాళ్ల సంఖ్య 17కు చేరింది. డీఏఓ పేపర్ లీక్ అయిన నేపథ్యంలో ఇప్పటికే ఆ పరీక్షను రద్దు చేసింది ప్రభుత్వం.