వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు అరెస్ట్.. రూ. 6 లక్షల 80వేల నగదు స్వాధీనం

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు అరెస్ట్.. రూ. 6 లక్షల 80వేల నగదు స్వాధీనం

జల్సాలకు అలవాటుపడి.. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ గా.. వరుస చోరీకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి రూ. 6 లక్షల 80 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. 

రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి 13వ తేదీన చోరీకి పాల్పడిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి.. రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు. వీరితో పాటు ఇంకో దొంగ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. గతంలో వీరిపై తెలంగాణతోపాటు మహారాష్ట్రలోనూ 20 కిపైగా కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు.