- యూపీలోని డియోరియాలో ఘటన
డియోరియా: మాస్క్లేకుండా రెండోసారి పట్టుబడ్డ ఓ వ్యక్తికి ఉత్తరప్రదేశ్ పోలీసులు రూ.పదివేల ఫైన్ వేశారు. డియోరియాలోని బారియార్పుర్ పోలీస్ సర్కిల్ ప్రాంతానికి చెందిన అమర్జిత్ యాదవ్ ఈ నెల 17తేదీ మాస్క్ లేకుండా తిరుగుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఫస్ట్ టైమ్ పట్టుబడ్డ అమర్జిత్ను హెచ్చరించడంతో పాటు వెయ్యి ఫైన్ విధించినట్లు పోలీసులు చెప్పారు. తర్వాతి రోజు(ఈ నెల 18) కూడా మాస్క్ లేకుండా బయట తిరుగుతుండడంతో రూ. 10 వేలు ఫైన్ వేశామని వివరించారు. ‘కొవిడ్ సేఫ్టీ ప్రొటోకాల్ను కచ్చితంగా అమలు చేయడానికి టీమ్లను ఏర్పాటు చేశాం. కరోనా ప్రొటోకాల్ పాటించని వ్యక్తులను మొదట హెచ్చరిస్తాం. ఆ తర్వాత రూ.1,000 ఫైన్ వేస్తాం. అప్పటికీ వినకుండా, నిబంధనలను ఉల్లంఘిస్తే 10 వేల రూపాయలు ఫైన్ విధిస్తాం’ అని డియోరియా ఎస్పీ వివరించారు.