మాస్క్​లేదని రూ.10 వేల ఫైన్ వేసిన పోలీసులు

మాస్క్​లేదని రూ.10 వేల ఫైన్ వేసిన పోలీసులు
  • యూపీలోని డియోరియాలో ఘటన

డియోరియా: మాస్క్​లేకుండా రెండోసారి పట్టుబడ్డ ఓ వ్యక్తికి ఉత్తరప్రదేశ్​ పోలీసులు రూ.పదివేల ఫైన్​ వేశారు. డియోరియాలోని బారియార్పుర్​ పోలీస్ సర్కిల్ ప్రాంతానికి చెందిన అమర్జిత్ యాదవ్​ ఈ నెల 17తేదీ మాస్క్ ​లేకుండా తిరుగుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఫస్ట్​ టైమ్​ పట్టుబడ్డ అమర్జిత్​ను హెచ్చరించడంతో పాటు వెయ్యి ఫైన్​ విధించినట్లు పోలీసులు చెప్పారు. తర్వాతి రోజు(ఈ నెల 18) కూడా మాస్క్​ లేకుండా బయట తిరుగుతుండడంతో రూ. 10 వేలు ఫైన్​ వేశామని వివరించారు. ‘కొవిడ్ సేఫ్టీ ప్రొటోకాల్‌‌‌‌ను కచ్చితంగా అమలు చేయడానికి టీమ్​లను ఏర్పాటు చేశాం. కరోనా ప్రొటోకాల్ పాటించని వ్యక్తులను మొదట హెచ్చరిస్తాం. ఆ తర్వాత రూ.1,000 ఫైన్​ వేస్తాం. అప్పటికీ వినకుండా, నిబంధనలను ఉల్లంఘిస్తే 10 వేల రూపాయలు ఫైన్​ విధిస్తాం’ అని డియోరియా ఎస్పీ వివరించారు.