
దేవరకొండ(కొండమల్లేపల్లి), వెలుగు : గొర్రెలు, మేకల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్చేశారు. కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్చార్జి సీఐ రాజు నిందితుల వివరాలు వెల్లడించారు. కొండమల్లేపల్లి మేగ్యతండాకు చెందిన ఆంగొతు గోపీచంద్, హైదరాబాద్ కర్మన్ ఘాట్ కు చెందిన పొడిపాటి స్టాలిన్ అలియాస్ సాయిచరణ్, చింతపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన ఉడుత శివ, ఒక మైనర్బాలుడి కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. రాత్రి సమయంలో గొర్లు, మేకలను దొంగిలించాలని నిర్ణయం తీసుకున్నారు.
గత జూన్ 6న కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామ శివారులోని రాత్రి రోడ్డు ప్రక్కన షెడ్డులో ఉన్న10 మేకలను దొంగిలించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం కొండమల్లేపల్లి చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటపడింది. వారిపై కొండమల్లేపల్లితోపాటు నాంపల్లిలో రెండు కేసులు, గుర్రంపూడ్ పరిధిలో మేకలను దొంగిలించిన కేసు నమోదయ్యింది. వారి వద్ద నుంచి రూ.2.20 లక్షలు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు ఇన్చార్జి సీఐ తెలిపారు.