కమల్‌ హాసన్‌, శంకర్‌ కు పోలీసు నోటీసులు

కమల్‌ హాసన్‌, శంకర్‌ కు పోలీసు నోటీసులు

సినీ నటుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్‌ కు చైన్నై పోలీసులు నోటీసులు జారీ చేశారు. దర్శకుడు శంకర్‌.. లైకా పోడక‌్షన్‌లో నిర్మిస్తున్న ‘ఇండియన్‌ -2’ సినిమా సెట్‌లో బుధవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. మృతుల్లో శంకర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌ మధు,అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ తో పాటు ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ ఉన్నారు. ప్రమాదం నుంచి హీరో కమల్‌ హాసన్‌, హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ తృటీలో తప్పించుకోగా, డైరెక్టర్‌ శంకర్‌ కాలికి గాయమైంది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడగా ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున కమల్‌ హాసన్‌ ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు..గాయపడి ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్న10 మందిని ఆయన పరామర్శించారు. ఒక్కొక్కరికి రూ. 50 లక్షల ఇస్తున్నట్లు చెప్పారు. లైకా పోడక్షన్‌ సంస్థ కూడా వారికి సాయం అందిస్తోంది. దర్శకుడు శంకర్‌ కూడా సాయం అందిస్తానని హామీ ఇచ్చాడు. ఈ ఘటనపై చెన్నై పోలీసులు లైకా సంస్థ యజమానితో పాటు, సినీ నిర్మాతలపై.. క్రేన్‌  యాజమాని, ఆపరేటర్లపై ఐపీసీ సెక్షన్‌ 287, 377 పలు కేసులు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.