ఏ సెక్షన్ ప్రకారం సోదాలు చేశారో చెప్పాలి

ఏ సెక్షన్ ప్రకారం సోదాలు చేశారో చెప్పాలి

దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇంట్లో, అతని బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. సిద్ధిపేటలోని రఘునందన్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఇదే టైంలో ఆయన బందువుల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. పోలీసుల దాడుల విషయం తెలసుకున్న రఘునందన్ రావు.. ప్రచారం మధ్యలోనే ఆపేసి.. వెంటనే సిద్ధిపేట చేరుకున్నారు. ఏ సెక్షన్ ప్రకారం తన ఇంట్లో సోదాలు చేశారో చెప్పాలంటూ పోలీసులతో గొడవకు దిగారు. కనీసం తన భార్యతో ఫోన్ కూడా మాట్లాడనివ్వలేదని పోలీసులను ప్రశ్నించారు. తన ఇంట్లో ఇప్పటివరకు ఏం స్వాధీనం చేసుకున్నారో ప్రకటించాలని డిమాండ్ చేశారు రఘునందన్. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తనను మాత్రమే టార్గెట్ చేసి సోదాలు చేయడమేంటని ప్రశ్నించారు. దుబ్బాకలో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ పోలీసులతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు.

ప్రస్తుతం ఇంటిముందు కార్యకర్తలతో కలిసి తన ఇంటిముందు బైఠాయించారు రఘునందన్. తన ఇంట్లో వెళ్లేందుకు రఘునందన్ ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున్న నినాదాలు చేస్తున్నారు బీజేపీ కార్యకర్తలు.