కేసీఆర్ ఫామ్ హౌస్.. ప్రగతి భవన్ లపై పోలీసులు రెయిడ్ చేయాలి

కేసీఆర్ ఫామ్ హౌస్.. ప్రగతి భవన్ లపై పోలీసులు రెయిడ్ చేయాలి

మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ మెంబర్ జి.వివేక్ వెంకటస్వామి డిమాండ్

హైదరాబాద్: పోలీసులకు నీతి, నిజాయితీ ఉంటే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్, ప్రగతి భవన్ లపై దాడులు చేయాలని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.  ఉప ఎన్నికలో బీజేపీ గెలవబోతోందనే సీఎం కేసీఆర్  కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తనకు సంబంధం లేని ఒక బిజినెస్ లావాదేవీల వ్యవహారంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్……తన  పేరును లాగడాన్ని ఆయన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. దుబ్బాకలో టీఆర్ఎస్ దారుణంగా ఓడిపోతోందని, బీజేపీ గెలవబోతుందనే విషయాన్ని కేసీఆర్ గ్రహించారు. అందుకే బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నాపైనా వ్యక్తిగతంగా కుట్రలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసులపై ఒత్తిడి తెచ్చిన సీఎం కేసీఆర్ పై పరువు నష్టం దావా వేసేందుకు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నాను. దుబ్బాక ఎన్నికల కోసం పోలీసులను వాడుకుని అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినప్పటికీ… బీజేపీ గెలుపు ఖాయం. దుబ్బాక ప్రజలు కేసీఆర్ తుగ్లక్ పాలన పట్ల విసుగు చెందారు. వారు తప్పకుండా బీజేపీని గెలిపించబోతున్నారు.  నిజంగా దుబ్బాకలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలంటే, దమ్ముంటే కేసీఆర్ ఫామ్ హౌస్ పై, ప్రగతి భవన్ పై పోలీసులు రెయిడ్ చేయాలి. ఓటర్లకు పంచేందుకు డబ్బులన్నీ టీఆర్ఎస్ పార్టీ అక్కడ నుంచే పంపిస్తోందన్నది బహిరంగ రహస్యం అని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు.