ఎమ్మెల్యే లాస్య నందిత మరణంపై సమగ్ర దర్యాప్తు చేయాలి : బండి సంజయ్

ఎమ్మెల్యే లాస్య నందిత మరణంపై సమగ్ర దర్యాప్తు చేయాలి : బండి సంజయ్

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. లాస్య మరణంపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను తొలగించాలని పోలీసులను కోరారు. యువ మహిళా ఎమ్మెల్యే ప్రమాదానికి గురి కావడం బాధాకరమని కుటుంబ సభ్యుల ఆందోళనను పరిగణలోకి తీసుకురావాలని సూచించారు. నిక్కచ్చిగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు బండి సంజయ్.

డ్రైవర్ ఆకాష్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అడిషనల్ ఎస్పీ సంజీవ రావు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి కుట్రలు, అనుమానాలు లేవని వెల్లడించారు. ఎమ్మెల్యే లాస్య మరణం రోడ్డు ప్రమాదం వల్లనే జరిగిందని.. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని వెల్లడించారు.