37 లక్షల మందికి పోలియో చుక్కలు

37 లక్షల మందికి పోలియో చుక్కలు

హైదరాబాద్, వెలుగు: ఆదివారం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైందని వైద్యాఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొన్నది. 33 జిల్లాల్లో 40,57,320 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 37, 53, 814 మందికి వేశామని చెప్పింది. సోమ, మంగళ, బుధవారాల్లో ఇంటింటికీ తిరిగి పోలియో డ్రాప్ లు వేయనున్నట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.