KCRను అరెస్ట్ చేయకుండా BJP గడ్డి పీకుతోందా

KCRను అరెస్ట్ చేయకుండా BJP గడ్డి పీకుతోందా

TRS, BJPల దొంగ దోస్తీని ఇప్పటికైనా ప్రజలు గమనించాలన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. KCR దేశద్రోహి, అవినీతి పరుడైనపుడు అరెస్ట్ చేయకుండా కేంద్రంలో ఉన్న BJP గడ్డి పీకుతోందా అని ప్రశ్నించారు. కేసీఆర్ కూడా ఎనీటైం మోడీ కోసమే పనిచేస్తారన్నారు. ధర్మం కోసం పోరాటం చేస్తామని చెప్పుకునే బీజేపీ నేతలు.. గుంట కాడి నక్కల్లా కాంగ్రెస్ నాయకుల ఇంటిచుట్టూ తిరుగుతున్నారన్నారు. హైదరాబాద్ ప్రజలకు ఇప్పటివరకు చేసింది, రేపు చేసేదీ కాంగ్రెస్సే అన్నారు పొన్నం. బండ కార్తీక రెడ్డి, సర్వే సత్యనారయణను సస్పెండ్ చేసి రెండు ఏండ్లఅయ్యిందని..గతంలో ఆమె మోడీని ఏమి అన్నదో ఆ వీడియోలు చూపించి జనాలు నవ్వుతున్నారన్నారు. కేసీఆర్ దేశ ద్రోహి అయితే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బీజేపీనే కదా అన్నారు.

కేసీఆర్ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న పొన్నం.. నడ్డా కూడా హైదరాబాద్ కు వచ్చి కేసీఆర్ అవినీతి చేశాడు అన్నారని..మరి ఎందుకు కేసీఆర్  మీద చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఎనీ టైమ్ మోడీ కోసం పనిచేస్తారన్న పొన్నం.. భారతీయ జనతా పార్టీ కరోనా సమయంలో.. వరదల సాయంలో బీజేపీ హైదరాబాద్ కు చేసిందేమీలేదన్నారు. గంట కొట్టమని మోడీ చెప్పాడు కానీ.. ఒక్క మాస్కు ఇచ్చాడా అన్నారు. కరోనా సమయంలో, వరదలప్పుడు జనాలకు కాంగ్రెస్ అండగా ఉందన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి మీద  చర్చకు మేము రెడీ అని.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా పోరాటం చేస్తామన్నారు.

దుబ్బాకలో టీఆర్ఎస్ ను ఓడించారని.. బీజేపీని గెలిపించాలని ఎవ్వరు ఆపార్టీకి ఓట్ వేయలేదన్నారు.  హైదరాబాద్ మేయర్ స్థానం తమదేనన్న పొన్నం…ఎంఐఎంను బూచిగా చూపించి బీజేపీ గెలవాలని చూస్తుందన్నారు.  ఎంఐఎం పోటీ చేసింది 45 సీట్లలో వాళ్ళతో మీకు పోటీ ఏందో అర్ధం కావడం లేదన్నారు పొన్నం.