పొన్నియిన్ సెల్వన్ 2 పబ్లిక్ టాక్.. మణిరత్నం హిట్టు కొట్టేడా?

పొన్నియిన్ సెల్వన్ 2 పబ్లిక్ టాక్.. మణిరత్నం హిట్టు కొట్టేడా?

తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ పొన్నియిన్ సెల్వన్2. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 28 శుక్రవారం రోజున ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం PS1 గత ఏడాది రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాదాపు 550 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీంతో సహజంగానే పార్ట్ 2పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య విడుదలైన పోనియన్ సెల్వన్ పార్ట్ 2 సినిమా ఎలా ఉంది? దానిపై ప్రేక్షకుల కామెంట్స్ ఎలా ఉన్నాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

యూఎస్ ప్రీమియర్స్ అండ్ మార్నింగ్ షోస్ నుండి వినిపిస్తున్న టాక్ ని బట్టి PS పార్ట్ వన్ తో పోలిస్తే పార్ట్ 2 సినిమా ఇంకా బాగుందట.  PS పార్ట్ వన్ విషయంలో మూవీ చాలా స్లోగా ఉందనే కామెంట్స్ వినిపించాయి. దీంతో.. పార్ట్ 2లో ప్రేక్షకులకు ఆ ఫీలింగ్ కలగకుండా జాగ్రత్త పడ్డారు మేకర్స్. ఇదే సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పుకుంటున్నారు.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. పార్ట్ వన్ లో విక్రమ్ – ఐశ్వర్యరాయ్ కు పెద్ద ప్రాధాన్యత లేదు. కానీ.. పార్ట్ 2 లో మాత్రం కథ మొత్తం వీళ్ల చుట్టే నడుస్తుందట. ఇక విక్రమ్ – ఐశ్వర్యరాయ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాత్రల్లో నటించారు అనడం కంటే జీవించారట. ఇక కార్తీ, జయం రవి, త్రిష కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారట. మొత్తంగా.. పీఎస్2  మూవీ తమిళ జనాలకు బాగా నచ్చేస్తుంది . అయితే మిగతా భాష జనాలకు ఎంతవరకు నచ్చుతుందో అనేది చూడాలి మరి.