
ఓవైపు వరుస షూటింగులు. ఇంకోవైపు కొత్త సినిమా సెట్స్లో జాయినింగులు. పక్కా ప్లానింగ్తో దూసుకెళ్తోంది పూజా హెగ్డే. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘కభీ ఈద్ కభీ దివాలీ’ షూటింగ్లో పాల్గొంటోంది పూజ. నిన్న ‘జనగణమన’ షూటింగ్లోనూ జాయినైపోయింది. ఈ విషయాన్ని టీమ్ సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేసింది. ఓ స్పెషల్ వీడియోతో పూజకి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ ప్యాన్ ఇండియా చిత్రాన్ని వంశీ పైడిపల్లితో కలిసి పూరి, చార్మి నిర్మిస్తున్నారు.
ఇందులో విజయ్ ఆర్మీ మేజర్గా కనిపించబో తున్నాడు. పూజ కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. తన రోల్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా ఉంటుందని మేకర్స్ చెప్పారు. ఇది పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో చాలా ప్రెస్టీజియస్గా తెరకెక్కుతోంది. ముంబైలో షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్లోనే పూజ జాయినయ్యింది. తర్వాత పలు ఇంటర్నేషనల్ లొకేషన్స్లో తీయబోతున్నాడు పూరి. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 3న మూవీని రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు. ఇక మహేష్, పవన్ల సినిమాలు మొదలైతే వాటిలోనూ పూజ జాయినవ్వాల్సి ఉంది. సూర్యతో సినిమా కన్ఫర్మ్ అయ్యింది కనుక అది కూడా త్వరలో సెట్స్కి వెళ్లే చాన్స్ ఉంది. ఇక యశ్తో చేయనున్న సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
మరిన్ని వార్తల కోసం : -
విజయ్ తో నాలుగోసారి జోడీగా సమంత
అదిరిపోయే స్టెప్పులేసిన రకుల్,మంచు లక్ష్మి