ఉప్పల్ స్టేడియానికి కరెంట్ నిలిపివేత

ఉప్పల్ స్టేడియానికి కరెంట్ నిలిపివేత

ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ కట్ చేశారు. కోట్లలో బకాయిలు పేరుకు పోవడంతో విద్యుత్ శాఖ అధికారులు పవర్ సప్లైను నిలిపివేశారు. బిల్లులు చెల్లించకుండా కరెంట్ వాడుకోవడంతో గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) పై విద్యుత్ శాఖ కేసు వేసింది. దీంతో హెచ్ సీఏ కోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు విద్యుత్ శాఖకు అనుకూలంగా రావడంతో వెంటనే పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలంటూ హెచ్సీఏకు విద్యుత్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా కూడా కరెంట్ బిల్లు చెల్లించకపోవడంతో కరెంట్ సరఫరా నిలిపివేశారు.