ముషీరాబాద్, వెలుగు: విద్యుత్ లైన్ మెయింటెనెన్స్ పనుల కారణంగా శనివారం సిటీలో పలు చోట్ల విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని అజమాబాద్ ఏడీఈ సీబీడీజీ నాగేశ్వరరావు ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు డీడీ కాలనీ, నల్లకుంట, సీసీ శ్రాప్, కాచిగూడ ప్రాంతాల్లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శాస్త్రినగర్, అజమాబాద్, విద్యానగర్ ప్రాంతాల్లో సరఫరా ఉండబోదని పేర్కొన్నారు.
