ఏషియాలోనే టాప్ సెలబ్రిటీగా ప్రభాస్

ఏషియాలోనే టాప్ సెలబ్రిటీగా ప్రభాస్

హైదరాబాద్: బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన డార్లింగ్ ప్రభాస్.. ఇప్పుడు మరో ఘతనను సాధించాడు. నంబర్ వన్ సౌత్ ఏషియన్ సెలబ్రిటీగా ప్రభాస్ నిలిచాడు. యూకేకు చెందిన ఈస్టర్న్ ఐ వీక్లీ న్యూస్ పేపర్ పబ్లిష్ చేసిన టాప్ 50 ఏషియన్ సెలబ్రిటీల లిస్టులో రెబల్ స్టార్ టాప్ పొజిషన్ దక్కించుకున్నాడు. వరల్డ్ సినిమా, టెలివిజన్, లిటరేచర్, గ్లోబల్ మ్యూజిక్, సోషల్ మీడియా స్టార్లను తోసిరాజని ప్రభాస్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ లిస్టులో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మూడు, ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ ఐదో ప్లేస్ ను దక్కించుకోవడం విశేషం. 

‘దేశ సినీ ప్రేక్షకుల కళ్లను ప్రాంతీయ భాషా చిత్రాల వైపు చూసేలా ప్రభాస్ చేశాడు. బాలీవుడ్ ఇక ఎంతమాత్రం బాస్ కాదని.. ఎవ్వరైనా తమ మూవీలను వేర్వేరు భాషల్లో రిలీజ్ చేసేలా ప్రభాస్ స్ఫూర్తిగా నిలిచాడు’ అని ఏషియన్ టాప్ సెలెబ్రిటీల లిస్టును రూపొందించిన ఈస్టర్న్ ఐ ఎంటర్ టైన్ మెంట్ ఎడిటర్ అస్జాద్ నజీర్ అన్నారు. కాగా, బిగ్ బీ అమితాబ్ (నంబర్ 32), దిల్జీత్ దోస్సాంజ్ (11), లిల్లీ సింగ్ (12), తాప్సీ (14), విజయ్ (15), రుబీనా దిలైక్ (17), అక్షయ్ కుమార్ (18) కూడా ఈ లిస్టులో చోటు సంపాదించారు.  ఇకపోతే, ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన రాధే శ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ మన ముందుకు రానుంది. ఇక ఆదిపురుష్, సలార్, స్పిరిట్, ప్రాజెక్టు కే చిత్రాల షూటింగ్ లతో డార్లింగ్ ఫుల్ బిజీగా ఉన్నాడు.