ప్రతినిధి 2 మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

ప్రతినిధి 2 మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

నారా రోహిత్ హీరోగా  మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన చిత్రం ‘ప్రతినిధి 2’. రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించారు. మే 10న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ రిలీజ్ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు మేకర్స్. ముఖ్యమంత్రిని ఎందుకు చంపాలని అనుకున్నావ్ ? నీ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ ఏమిటి? అని హీరోని విచారించడంతో మొదలైన ట్రైలర్ ఆకట్టుకుంది.

బాంబు పేలుడులో సీఎం చనిపోగా, ఆయన కుమారుడే ఆ బాధ్యత తీసుకోవాలని రికమండేషన్లు వస్తాయి. సీఎం మరణానంతరం అధికార, ప్రతిపక్ష పార్టీల డ్రామాలని గ్రిప్పింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చూపించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.  ఇందులో  నారా రోహిత్  న్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ‘దేశాన్ని కాపాడటానికి ఒక సైనికుడు, కడుపు నింపడానికి ఒక రైతు ఎంత ఇంపార్టెంటో.. సొసైటీకి జర్నలిస్టు అంతే ఇంపార్టెంట్’ అని నారా రోహిత్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది.