మాఘ పౌర్ణిమి..కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

మాఘ పౌర్ణిమి..కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

ప్రయాగ్ రాజ్ అర్థ కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఇవాళ మాఘ పౌర్ణిమ కావడంతో…  భక్తులు అధికంగా తరలి వచ్చి పుణ్య స్నానాలు చేస్తున్నారు. అర్థ కుంభమేళాలో మాఘ పౌర్ణిమను 5వ షాహీ స్నాన్ గా పరిగణిస్తారు. ఈ రోజు పుణ్య స్నానాలు చేసి… పూజలు చేయడం వల్ల పుణ్యం వస్తుందని నమ్ముతారు. తెల్లవారుజాము నుంచే లక్షల సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. ఈ ఒక్కరోజే… 80లక్షల మంది పుణ్యస్నానాలు చేస్తారని అంచనా వేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.