
చైల్డ్ ఆర్టిస్ట్గా ఆకట్టుకున్న ప్రీతి అస్రాని, ఇప్పుడు హీరోయిన్గానూ బిజీ అవుతోంది. శ్రీసింహాతో కలిసి ఆమె నటించిన ‘దొంగలున్నారు జాగ్రత్త’ ఈ నెల 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీతి ఇలా ముచ్చటించింది.
‘‘మళ్ళీ రావా, ప్రెజర్ కుక్కర్, సీటీమార్ చిత్రాల్లోని నా పాత్రలకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు మరో యునిక్ కాన్సెప్ట్తో వస్తున్నా. నీరజ అనే మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపిస్తా. నిడివి తక్కువే అయినా కీలకమైన పాత్ర. మేకింగ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఊహించని మలుపులుంటాయి. కాన్సెప్ట్ ప్రకారం ఒకే లొకేషన్లో, ఒకే కాస్ట్యూమ్స్లో ఉంటాం. బ్రిలియెంట్ యాక్టర్స్తో, చక్కని విజన్ ఉన్న టీమ్తో కలిసి వర్క్ చేయడం హ్యాపీ. ఇందులో నా క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో రియల్ లైఫ్లోనూ నేనంతే స్ట్రాంగ్. ధైర్యంగా ఉండటం, మొండితనం లాంటి క్వాలిటీస్ నాలోనూ ఉన్నాయి.
బేసిగ్గా మాది గుజరాత్. ఐదేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చా. ఇక్కడికొచ్చాకే తెలుగు నేర్చుకున్నా. అంజు అస్రాని మా అక్క. తనే నాకు స్ఫూర్తి. ఎక్కువగా డీసెంట్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే నటించా. ఎందుకంటే నాకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. వాటిని దాటలేక కొన్ని ఆఫర్స్ వదులుకున్నా కూడా. జానర్ ఏదైనా పర్లేదు.. నటనకు ఆస్కారమున్న చాలెంజింగ్ రోల్స్ కోసం చూస్తున్నా. సమంత, సాయిపల్లవిల హీరోయిన్ సెంట్రిక్ సినిమాలంటే నాకిష్టం. ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళంలో మరో రెండు సినిమాలున్నాయి. ‘యశోద’ చిత్రంలో ఓ క్యామియో రోల్ చేశా. అన్నపూర్ణ సంస్థ నిర్మిస్తున్న వెబ్ సిరీస్లోనూ నటిస్తున్నా.’’