5 కి.మీ. గర్భిణిని మోసుకెళ్లారు..

5 కి.మీ. గర్భిణిని మోసుకెళ్లారు..

విశాఖ: గర్భిణీ స్త్రీ కి నొప్పులు రావడంతో డెలివరీ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు డోలీలో మోసుకెళ్లాల్సి వచ్చింది. ఈ సంఘటన విశాఖ జిల్లా వి.మాడుగుల మండలం కొత్తవలస గ్రామములో జరిగింది.  గ్రామానికి చెందిన జనపరెడ్డి దేవి అనే గర్భిణీ స్త్రీకి అత్యవసర పరిస్థితి లో ప్రసవం కోసం హుటాహుటిన డోలీలో  తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు 5 కిలోమీటర్లు కుటుంబసభ్యులు, గ్రామస్తులు కలసి డోలీలో  తీసుకొని వచ్చారు. అక్కడ నుంచి 108 లో కేజే పురం ఆసుపత్రికి తరలించ్చారు. ప్రస్తుతం తల్లి,బిడ్డ క్షేమంగానే ఉన్నారు. బాధితురాలి భర్త మాట్లాడుతూ రోడ్డు సదుపాయం లేక ఏ పరిస్థితి ఏర్పడిందని కొంచెం ఆలస్యమై  ఉంటే తల్లి,పిల్ల ఇద్దరికి ప్రమాదం జరిగేదని అన్నాడు.