హైదరాబాద్‌లో మరో కంట్రీ చికెన్​ ఔట్​లెట్​

హైదరాబాద్‌లో మరో కంట్రీ చికెన్​ ఔట్​లెట్​

హైదరాబాద్, వెలుగు :  ప్రీమియం  కంట్రీ చికెన్ బ్రాండ్ 'కంట్రీ చికెన్ కో' ఆరో  ఔట్‌లెట్‌ను సైనిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పురిలో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆదివారం ప్రారంభించారు. సంస్థ సీఈ ఓ సాయికేష్​ మాట్లాడుతూ తాము నాటు కోడితో పాటు గుడ్లనూ అందిస్తామని చెప్పారు. వీటిని గ్రామ పెరట్లలో, ఫ్రీ రేంజ్ ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో పెంచుతామన్నారు. స్టెరాయిడ్, యాంటీ బయాటిక్స్​ వాడటం లేదని తెలిపారు. కొత్తగా న్యూట్రిసాఫ్ట్ చికెన్​ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు.