హైదరాబాద్, వెలుగు : ప్రీమియం కంట్రీ చికెన్ బ్రాండ్ 'కంట్రీ చికెన్ కో' ఆరో ఔట్లెట్ను సైనిక్పురిలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆదివారం ప్రారంభించారు. సంస్థ సీఈ ఓ సాయికేష్ మాట్లాడుతూ తాము నాటు కోడితో పాటు గుడ్లనూ అందిస్తామని చెప్పారు. వీటిని గ్రామ పెరట్లలో, ఫ్రీ రేంజ్ ఫారమ్లలో పెంచుతామన్నారు. స్టెరాయిడ్, యాంటీ బయాటిక్స్ వాడటం లేదని తెలిపారు. కొత్తగా న్యూట్రిసాఫ్ట్ చికెన్ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు.