రాష్ట్రపతికి అస్వస్థత..ఆర్మీఆస్పత్రిలో చేరిక

రాష్ట్రపతికి అస్వస్థత..ఆర్మీఆస్పత్రిలో చేరిక

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఆర్మీఆస్పత్రిలో చేరారు. ఉదయం డాక్టర్లు వైద్యపరీక్షలు చేశారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని..అబ్జర్వేషన్ లో ఉన్నట్లు చెప్పారు. ఇటీవలే రెండో దశలో ఢిల్లీలోని ఆర్మీఆస్పత్రిలో రామ్ నాథ్ కోవింద్  వ్యాక్సిన్ వేయించుకున్నారు.