
జీ20 సమిట్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగ్నాత్, బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో శుక్రవారం భేటీ కాగా.. శని, ఆదివారాలతో కలిపి మొత్తంగా 15కు పైగా ద్వైపాక్షిక సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు.
శనివారం బ్రిటన్, జపాన్, జర్మనీ, ఇటలీ దేశాల నేతలతో ప్రధాని మోదీ వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఆదివారం ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మేక్రాన్తో లంచ్ మీటింగ్ నిర్వహించనున్నారు. అదే రోజున కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో భేటీ కానున్నారు. కొమొరోస్, తుర్కియే (టర్కీ), యూఏఈ, సౌత్ కొరియా, ఈయూ/ఈసీ, బ్రెజిల్, నైజీరియా తదితర దేశాల నేతలతోనూ చర్చించనున్నారు.